విజయవాడ నగరలోని రెడ్ జోన్ పరిధిలో విధించిన లాక్డౌన్ను మరింత పటిష్టంగా అమలుచేస్తామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు అన్నారు.
ఆదివారం నగరంలోని రెడ్జోన్ ప్రాంతాలైన విద్యాధరపురం, పాత రాజరాజేశ్వరిపేట, రాణిగారితోట, ఖుద్దూస్నగర్, పాయకాపురం, సనంత్నగర్లో అంతర్గత వీధుల్లో వాహనాల రాకపోకలను నియంత్రించడంతో పాటు లాక్డౌన్ సంపూర్ణ౦గా అమలు జరిపేందుకు ఏర్పాట్లు పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ విజయవాడ నగరంలో ఉన్న అన్ని రెడ్జోన్ ప్రాతాలలో లాక్డౌన్ను ఖచ్చితంగా అమలు చేసేందుకు విస్తృత చర్యలు చేపట్టామన్నారు. రెడ్ జోన్ ప్రాంతాలలో డ్రోన్ కెమెరాల సాయంతో అంతర్గత౦గా ప్రజల కదలికలను నియంత్రిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు, ఐజీ సత్యనారాయణ, డీసీపీ విక్రాంత్పాటిల్, హర్షవర్ధన్, మేరీ ప్రశాంతి, కోటేశ్వరరావు, పశ్చిమ మండల ఏసిపి సుధాకర్, మరియు ఇతర ఏసీపీలు, భవానీపురం సిఐ మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.