తెలంగాణ రాష్ట్ర తొలి, మలి దశ ఉధ్యమకారుడు, రాష్ట్ర మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అకాల మరణం రాష్ట్రానికి తీరని లోటు అని హుజూర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో నాయిని నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సైదిరెడ్డి వారితో ఉన్న సంబంధాన్ని గుర్తుకు చేసుకున్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో జరగబోయే MLC ఎన్నికల సన్నాహక సమావేశానికి అన్ని మండలాల ప్రజాప్రతినిధులు, ఎన్నికల ఇంచార్జ్ లు తగిన సమాచారంతో తప్పకుండా హాజరు కావాలని సూచించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ ఛైర్మన్ గెల్లి అర్చన రవి, వైస్ ఛైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, హుజూర్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కడెం వెంకట రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు అమరనాధ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి, అమర్, ఎంపిపి గుడెపు శ్రీనివాస్, జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, టిఆర్ఎస్ నాయకులు KLN రెడ్డి, ముడెం గోపి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.