34.2 C
Hyderabad
April 23, 2024 14: 16 PM
Slider నల్గొండ

అర్చక సమాఖ్య కన్వీనర్ గంగు భానుమూర్తి మృతికి సంతాపం

#GanguBhanumurthy

తెలంగాణ రాష్ట్ర అర్చక సమాఖ్య కన్వీనర్ గంగు భానుమూర్తి అకాల మృతికి అర్చక సంఘం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్ళచెరువు మండల కేంద్రంలోని శ్రీ ఇష్టాకమేశ్వరి సమేత శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి వారి దేవస్థాన అర్చకులు కొంకపాక శివ విష్ణువర్ధన్ శర్మ, ధనుంజయ శర్మ, ఆలయ ఈవో సత్యనారాయణ, జూనియర్ అసిస్టెంట్ కొండారెడ్డి గంగు భానుమూర్తి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా విశ్రాంత అర్చకులు వెంకటేశ్వర శర్మ, శ్రీమాత చారిటబుల్ ట్రస్ట్, త్రిశక్త్యాత్మక చండీ పీఠం వ్యవస్థాపకుడు శాత చండీ యాగ నిర్వాహకులు కొంకపాక రాధాకృష్ణ మూర్తి శర్మ మాట్లాడుతూ గంగు భానుమూర్తి  హఠాన్మరణం అర్చక సంఘానికి తీరనిలోటని అన్నారు.

తెలంగాణ అర్చకులకు ఆయన చేసిన సేవ మరువలేనిదని, రాష్ట్ర అర్చక లోకాన్ని ఒక్కతాటిపైకి తీసుకొని వచ్చి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల సాధన కోసం అం పోరాడిన యోధుడు అని అన్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  మేళ్లచెరువు అర్చకులు, చింతలపాలెం మండలం అర్చకులు, పాల్గొన్నారు.

Related posts

సీఎం పర్యటనకు వినుకొండలో ఏర్పాట్లు పూర్తి

Bhavani

అందంగా తీగల వంతెన

Murali Krishna

కొత్త రేషన్ కార్డులు, పింఛన్ల కోసం 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ

Satyam NEWS

Leave a Comment