తెలంగాణ లో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కేసీఆర్ కు అమ్ముడుపోయాయని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వై ఎస్ షర్మిల ఆరోపించారు.
నేడు మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేరు చెప్పకుండానే ఆయనపై విమర్శలు చేశారు.
బండి సంజయ్ వద్ద కేసీఆర్ అవినీతి కి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని ప్రతి సారీ చెబుతున్నారని అయితే ఇప్పటి వరకూ తదుపరి చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆమె ప్రశ్నించారు.
బిజెపి టీఆర్ఎస్ మధ్య అవగాహన ఉంది కాబట్టే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆమె అన్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కు ఏనాడో అమ్ముడు పోయిందని షర్మిల అన్నారు.