కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణులలో అంబరాన్ని అంటిన విధంగా సంబురాలు జరుపుకున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఇందిరా సెంటర్ లో కోదాడ మాజీ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు శనివారం టపాసులు కాల్చి,స్వీట్లు పంపిణీ చేసుకొని ఉత్సహంగా విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ పద్మావతి రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు,కార్యకర్తలు,అభిమానులు పెక్కు సంఖ్యలో పాల్గొన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్