40.2 C
Hyderabad
April 19, 2024 15: 57 PM
Slider నల్గొండ

కాంగ్రెస్ పార్టీ నేతల్లో అంబరాన్ని అంటిన సంబురాలు

#padmavati

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణులలో అంబరాన్ని అంటిన విధంగా సంబురాలు జరుపుకున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఇందిరా సెంటర్ లో కోదాడ మాజీ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు శనివారం టపాసులు కాల్చి,స్వీట్లు పంపిణీ చేసుకొని ఉత్సహంగా విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ పద్మావతి రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు,కార్యకర్తలు,అభిమానులు పెక్కు సంఖ్యలో పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

సబ్ ప్లాన్ నిధులు ఎస్సీ ఎస్టీల కోసమే ఖర్చు చేయాలి

Satyam NEWS

T20 cricket: ఆస్ట్రేలియాకు చేరుకున్న గర్ల్ ఫ్రండ్స్

Satyam NEWS

గున్నాల వారి కళ్యాణమహోత్సవానికి వెళ్లిన కుసుమ

Satyam NEWS

Leave a Comment