జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని జార్ఖండ్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకునిగా పని చేసిన ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను కాంగ్రెస్ నేతలు అభినందించారు.
హైదరాబాద్ లోని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో సంపత్ కుమార్ కి మిఠాయి తినిపించి అభినందించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు.