జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 136 సంవత్సరాలు అయిన సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఇందిరా సెంటర్ లో భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ జెండాలను చేతబూని పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి అభినందనలు తెలుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర INTUC ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్, టి పి సి సి జాయింట్ సెక్రెటరీ అజీజ్ పాషా మాట్లాడుతూ భారతదేశంలో పేదలందరికీ సమాన ఫలాలు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు.
1885లో ఎ.ఓ.హ్యూమ్ స్థాపించిన కాంగ్రెస్ పార్టీ నేటికి 136 వసంతాలు అయ్యాయని, భారత స్వాతంత్ర్య సిద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో మహాత్మా గాంధీ,బి ఆర్ అంబేద్కర్ వంటి మేధావులు ఎందరెందరో శ్రమించారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ పాలన సమయంలో అనేక బహుళార్ధ సాధక ప్రాజెక్టులు, రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ, ఎస్ టి,ఎస్ సి లకు భూ పంపిణీ, ఉపాధి హామీ పథకం, సమాచార చట్టం వంటి మహోన్నతమైన పథకాలు చేపట్టిందని అన్నారు.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయభేరి మ్రోగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్, బాచిమంచి గిరిబాబు, ముషం సత్యనారాయణ, బెల్లంకొండ గురవయ్య,
కౌన్సిలర్ ములకలపల్లి రామగోపి, పాశం రామరాజు, కుక్కడపు మహేష్ గౌడ్, జింజిరాల సైదులు, సలిగంటి జానయ్య, దొంతగాని జగన్, కంకణాల పుల్లయ్య, పోతనబోయిన రామ్మూర్తి, వెలిదండ వీరారెడ్డి, బుచ్చయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.