కరోనా లాక్ డౌన్ సమయంలో కరోనా రోగులకు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ సాజిద్ ఖాన్ చేస్తున్న సేవలను గుర్తించి స్నేహితుల బృందం ఆయనను సాత్నాల గ్రామంలో సన్మానించారు.
ఈ సందర్భంగా వాము మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో సాజిద్ ఖాన్ ఆదిలాబాద్ లో పేద ప్రజలను ఎందరినో అందుకున్నారన్నారు.
పనులు లేక జీవనం కష్టం అయిన సమయంలో సాజిద్ ఖాన్ ఎన్నో కుటుంబాలకు నిత్యావసర సరుకులను సొంత డబ్బు తో పంచిపెట్టి వారి ఆకలిని తీర్చారని తెలిపారు.
ప్రస్తుతం కరోనా వైరస్ తో చనిపోయిన మృతదేహాలకు ముందుండి అంత్యక్రియలు నిర్వహించడం ఎంతో గొప్ప పని అన్నారు. యువత ఆయన ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు.
సాజిద్ ఖాన్ తమ స్నేహితుడు అవ్వడం తమకు ఎంతో గర్వంగా ఉందన్నారు. అనంతరం సాజిద్ ఖాన్ మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి తన సొంత ఖర్చులతో వారికి నిత్యావసర సరుకులను పంచినట్లు తెలిపారు.
పేద ప్రజలను ఆదుకునేందుకు, కరోనా తో బాధపడుతున్న వారికి, కరోనా వల్ల చనిపోయిన మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడానికి యువత ముందుకు రావాలని కోరారు.