32.7 C
Hyderabad
March 29, 2024 13: 14 PM
Slider ఆదిలాబాద్

కరోనా మృతుని కుటుంబానికి అండగా నిలిచిన మానవత్వం

#CoronaDeath

కరోనాతో కుటుంబాలకు కుటుంబాలే ఆగమైపోతున్నాయి. ఆదిలాబాద్ పట్టణం లో గంగన్న అనే వ్యక్తి కొన్ని రోజులుగా కోవిడ్ వైరస్ సోకి రీమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు.

ఆయన కుటుంబ సభ్యులు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ సాజిద్ ఖాన్ ను కలిసి తమ కష్టం చెప్పుకున్నారు. ఆయన తనకు తోచిన సాయం చేశారు.

అయితే దురదృష్టవశాత్తూ గంగన్న కరోనాతో మరణించాడు. ఏం చేయాలో అర్ధం కాని ఆ కుటుంబానికి సాజిద్ ఖాన్ ధైర్యం చెప్పారు.

కోవిడ్ అధికారులతో  మాట్లాడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సమక్షంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ మృతదేహానికి హిందు సాంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించారు.

కోవిడ్ కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నదనడానికి గంగన్న ఉదాహరణ చాలు. ఆ కుటుంబానికి పెద్ద దిక్కు పోయింది. అయితే ఆ కుటుంబానికి తాను అండగా ఉంటానని సాజిద్ ఖాన్ తెలిపారు.

ఏ ఇబ్బంది వచ్చినా తనకు కబురు చేయాలని, తన శక్తి మేరకు ఆదుకుంటానని వారికి తెలిపారు. కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు.

Related posts

అక్టోబర్ 14 న గ్రాండ్ గా “నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా”..

Satyam NEWS

వైఎస్ఆర్ టిపి ములుగు మండల కమిటీ ఏర్పాటు

Satyam NEWS

ఉదారత చాటిన దళిత గిరిజన ప్రజాప్రతినిధులు

Satyam NEWS

Leave a Comment