అదిలాబాద్ జిల్లా కేంద్రంలో విద్యుత్ కార్మికుల హక్కుల సాధన కోసం ఐఎన్టీయుసి అనుబంధ సంస్థ 327 ఆధ్వర్యంలో స్థానిక సర్కిల్ కార్యాలయం లో చేస్తున్న రెండు రోజుల రిలే నిరాహార దీక్షకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ నేడు మద్దతు పలికారు.
ఈ సందర్భంగా సాజిద్ ఖాన్ మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, రాష్ట్రంలో అందరూ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మాట తప్పారని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో షేక్ కలీమ్,మోసిన్ పటేల్, రాజు యాదవ్ ,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.