మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షునిగా మాజీ కార్పొరేటర్ మందుముల పరమేశ్వర్ రెడ్డి నియమితులయ్యారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షునిగా పి సి సి కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నంది కంటి శ్రీధర్ నియామక ఉత్తర్వులను అందజేశారు.
బి బ్లాక్ అధ్యక్షునిగా నియమితులైన సోమశేఖర్ రెడ్డి నియోజకవర్గంలోని ఐదు డివిజన్లకు సంబంధించి పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. ఈ సందర్భంగా అధ్యక్షునిగా నియమితులైన సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి అధ్యక్షునిగా నియమించిన పి సి సి చీఫ్ రేవంత్ రెడ్డి , జిల్లా అధ్యక్షులు నంది కంది శ్రీధర్ లకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
ఏ బ్లాక్ అధ్యక్షునిగా నియమితులైన పరమేశ్వర్ రెడ్డి ఉప్పల్ నియోజకవర్గంలోని ఐదు డివిజన్లకు సంబంధించి పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. ఈ సందర్భంగా అధ్యక్షునిగా నియమితులైన మంద మల పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి అధ్యక్షునిగా నియమించిన పి సి సి చీఫ్ రేవంత్ రెడ్డి , జిల్లా అధ్యక్షులు నంది కంది శ్రీధర్ లకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.