సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని 13వ,వార్డు పరిధిలో వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ తేజావత్ రాజా నాయక్ సోదరుడు తేజావత్ ధర్మనాయక్ బుధవారం రాత్రి పాముకాటుతో మరణించగా, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ధర్మానాయక్ పార్థివ దేహంపై పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్, కస్తాల శ్రవణ్ కుమార్, పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ధర్మ నాయక్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వెల్దండ వీరారెడ్డి, కారంగుల వెంకటేశ్వర్లు, త్రివేణి వెంకటేశ్వర్లు, సైదులు నాయక్, పులి గోవిందు తదితరులు పాల్గొని సంతాపం తెలియజేశారు.