శంషాబాద్ పరిధిలోని శాతంరాయి వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఎయిర్పోర్టు నుంచి తిరిగి వస్తుండగా కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ యువతి మృతిచెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన యువతిని టీపీసీసీ మైనార్టీ విభాగానికి చెందిన ముఖ్య నేత, నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఫిరోజ్ఖాన్ కుమార్తె తనియాగా గుర్తించారు. ఆమె మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎయిర్పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.