ఈ నెల 9 వ తేదీన ఇంద్రవెల్లి లో ఏర్పాటు చేయబోతున్న సభా ప్రాంగణాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నేడు పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమంలో గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రమణ రావు, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ థాహెర్ బిన్ మన్నాన్,ఆదిలాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ సాజిద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
అదే విధంగా సభను విజయవంతం చేయాలని కోరుతూ జైనథ్ మండల కేంద్రంలో, బేలా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ముందుగా జైనథ్ లో గల ప్రసిద్ద పుణ్యాక్షేత్రం శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, టీపీసీసి రాష్ట్ర కార్యదర్శి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్, ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత, మండల అధ్యక్షులు కల్చప్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు జగదీష్ రెడ్డి, ఎంపీటీసీ సుదర్శన్, శాంతన్ రావు సీనియర్ నాయకులు యాసం నర్సింగ్ రావు, భీంరెడ్డి, అశోకరెడ్డి, పోతారెడ్డి, హన్మంత్ రెడ్డి, విశాల్, జగదీష్ రెడ్డి, శ్రీకాంత్, సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.