కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని ఎల్లారం, రాజాపూర్ ,గ్రామాల్లో దొమ్మగండి తాండాలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం పండుగలా కొనసాగింది. ఈ కార్యక్రమానికి మాజీ శాసన సభ్యులు జుక్కల్ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు సౌదాగర్ గంగారాం హాజరయి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగిస్తుందని తెరాసపై ప్రజలు విశ్వాసం కోల్పోయారన్నారు. అమలుకాని హామీలతో కేసీఆర్ పబ్బంగడుపుతున్నారని ఆయన తీరుపై ఆక్షేపించారు.తెరాస భాజపా దొందూ దొందేనని గత ఢిల్లీ పర్యటనలోనే తేలిపోయిందన్నారు.ఇప్పటికైన ప్రజలు ఆ రెండు పార్టీలకు నమ్మరాదన్నారు.కేంద్రం నీధి రాష్ట్రం నాది అనే విధంగా వారి తీరు ఉందని కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెసు పార్టీ బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో ఆయనతో పాటు ఐటి సెల్ వైస్ ప్రెసిడెంట్ సతీష్ ,కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు దర్పల్లి గంగాధర్ ,యువ నాయకులు వీరేందర్, భాస్కర్, గంగాసాగర్,జాదవ్ సుచిత్ కుమార్,ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ యాదయ్య,మల్లేష్ పటేల్ ,మాజీ ఎంపీటీసీ తెజారావ్ ,నారాయణ ,మునీర్, విఠల్రావు తదితరులున్నారు.
జి. లాలయ్య సత్యం న్యూస్ రిపోర్టర్ జుక్కల్