30.7 C
Hyderabad
April 17, 2024 01: 07 AM
Slider నల్గొండ

ఆసుపత్రుల్లో సౌకర్యాలపై ఆరా తీసిన కాంగ్రెస్ ప్రతినిధి

#HujurnagarHospital

కరోనా రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలపై రాష్ట్ర PCC అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి హుజూర్ నగర్ ఏరియా వైద్యశాలలో విచారించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ ను ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ పి సి సి అధ్యక్షుడు, నల్గొండ ఎంపి  ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు తాను ఈ వివరాలు సేకరించినట్లు అల్లం ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కరోనా కేసుల విషయంలో ఆక్సిజన్, వెంటిలేటర్లు, కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులో ఉన్నాయా? లేవా? అని ఆయన అడిగారు. ఏరియా వైద్యశాల అందుబాటులోకి రాని పరికరాల గురించి సూపరింటెండెంట్ ప్రభాకర్ రెడ్డి కి వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం

Satyam NEWS

తెలంగాణ లో పదవీ విరమణ వయసు 61 సంవత్సరాలకు పెంపు

Satyam NEWS

వనపర్తి ఆర్డీవో కార్యాలయ భవనం రికార్డుల నిర్వహణను ప్రారంభించిన మంత్రి

Satyam NEWS

Leave a Comment