27.7 C
Hyderabad
April 24, 2024 10: 09 AM
Slider మెదక్

దండుమైలారంలో దివంగ‌త‌ కాంగ్రెస్ నేత రాకేష్ విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ‌

#komatireddy

ప్ర‌జ‌లకు అందుబాటులో ఉండే గొప్ప నేత‌ల‌ను కాంగ్రెస్ పార్టీ  కోల్పోయింద‌ని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్ నేత ఈదుల‌కంటి రాకేష్ సేవ‌ల‌ను కొనియాడారు. నేడు ఇబ్ర‌హీంప‌ట్నం మండ‌లం దండుమైలారం గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈదులకంటి రాకేష్ గౌడ్ విగ్రహన్ని ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మాట్లాడుతూ… ప్ర‌తి ఒక్క‌రికీ అండ‌గా ఉండి చిర‌స్థాయిగా నిలిచిపోయిన నేత రాకేష్ అని కొనియాడారు. మంచి భ‌విష్య‌త్ ఉన్న నేత‌ల‌ను కాంగ్రెస్‌పార్టీ కొల్పోయిందని తెలిపారు.పేద‌లకు ఏ ఇబ్బంది ఉన్న వెంట‌నే మా దృష్టికి తీసుకువ‌చ్చి ప‌రిష్కారం కోసం కృషి చేసేవార‌ని వివ‌రించారు. ఆయ‌న ఆత్మ‌శాంతిచేకూరాల‌ని ప్రార్థిస్తున్నామ‌న్నారు.

అలాగే మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్ర‌జానేత‌గా పేరు తెచ్చుకున్న రాకేష్ మ‌ర‌ణం తీవ్ర‌బాధకు గురిచేసింద‌ని తెలిపారు. ప్ర‌జ‌ల‌కు స‌మ‌స్య అని తెలిస్తే ప‌గ‌లు రాత్రి అనే తేడా లేకుండా వారి కోసం ఎంతో క‌ష్ట‌ప‌డే త‌త్వం రాకేష్ సొంత‌మ‌న్నారు. త‌ప్ప‌కుండా వారి కుటుంబానికి అండ‌గా ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు.

Related posts

సైనికులు, నక్సలైట్ల మధ్య భారీ ఎన్‌కౌంటర్

Satyam NEWS

దాతల చేయూత కోసం తలసేమియా చిన్నారి ఎదురు చూపు

Satyam NEWS

కరోనా ఎలర్ట్: విజయవాడలో మరింత అప్రమత్తం

Satyam NEWS

Leave a Comment