నిత్యావసర ధరలు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గంలో ఈసీఐఎల్ చౌరస్తా లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు టిపిసిసి కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఎస్ రావునగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష్ సోమశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ధరలను వెంటనే తగ్గించి పేద, మధ్యతరగతి ప్రజలపైన భారం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.
ధరలు తగ్గించే వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కె. సీతారాం రెడ్డి జిల్లా కార్యదర్శి సింగిరెడ్డి వెంకట్ రెడ్డి, పెద్ది శ్రీనివాస్ గుప్తా, నాయకులు పత్తి కుమార్, బీఎస్ టి సాయికుమార్, గడ్డం యాదగిరి, అభినవ్ గౌడ్, బెల్లం శ్రీనివాస్, ముసలి శ్రీనివాస్ రెడ్డి, నెమలి అనిల్, ఆడెపు శ్రీనివాసులు, గోపాల్ యాదవ్, శ్రీకాంత్, నాంచారయ్య, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు కల్పన రెడ్డి, పాలడుగుల పద్మ, మెరుగు సునీత, వాణి, రాధిక, ముదిగొండ చిన్న, నాను తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి