జాతీయ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కడప జిల్లా రాజంపేట పాత బస్టాండ్ పెట్రోల్ బంక్ దగ్గర నిరసన ప్రదర్శన నిర్వహించారు.
రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ పూల భాస్కర్, సన్నీ, టౌన్ అధ్యక్షుడు అల్తాఫ్ , బిల్లా పెంచ లయ్య రవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పులా భాస్కర్ మాట్లాడుతూ వ్యాక్సినేషన్ అందించడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని, ప్రజలను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని, లాక్ డౌన్ పేర్లతో ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే, ఐదు కేజీల బియ్యం తో బ్రతకమని చెప్పిన నరేంద్రమోడీ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు.
వెంటనే నిత్యావసర సరుకులు డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు తగ్గాలి అంటే జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు.