32.2 C
Hyderabad
March 29, 2024 00: 18 AM
Slider ఆదిలాబాద్

కరోనా బ్లాక్ ఫంగస్ బాధితుల కోసం సత్యాగ్రహ దీక్ష

#congress 1

అర్హులైన 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కోవిడ్  టీకాను ఉచితంగా వేయాలని డిమాండ్ చేస్తూ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా డిసిసి ఓబిసి చైర్మన్ దాసరి వెంకటేష్ సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు సోమవారం రోజున ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు కాగజ్ నగర్ ద్వారకా నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఓబిసి డిపార్ట్మెంట్ ఆఫీస్ లో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు.

కరోనా, బ్లాక్ ఫంగస్ రోగులకు (BPL కుటుంబాలన్నింటికి) ప్రభుత్వమే ఉచితంగా చికిత్స అందించాలని సత్యాగ్రహ దీక్ష లో కూర్చున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ దస్తగిర్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ షబ్బీర్ హుస్సేన్, జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు యూసుఫ్ ఖాన్ మధ్యాహ్నం నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు.

Related posts

32,080 క‌రోనా పాజిటివ్‌, 402 మృతులు

Sub Editor

వదల బొమ్మాళీ: సీఎం జగన్‌కు రఘురామ మరో లేఖ

Satyam NEWS

దేవీ శ‌ర‌న్న‌వరాత్రుల సంద‌ర్బంగా ఆధ్యాత్మిక ప్ర‌వ‌చనం…!

Satyam NEWS

Leave a Comment