కామారెడ్డి బంద్ కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కామారెడ్డి రైతు జేఏసీ ఇచ్చిన బంద్ కు కాంగ్రెస్ శ్రేణులు మద్దతు ఇచ్చి అంత పాల్గొని విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి కోరారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదా ను రద్దు చేసి ప్రజా క్షేత్రం లో సభలు జరిపి రైతులతో చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మంత్రి కేటీఆర్, జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యం వల్లనే సమస్య జఠిలం అయ్యిందని ఆయన తెలిపారు.
వెంటనే ప్రభుత్వం రైతులతో చర్చించి సమస్యలను పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి అన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు.