28.7 C
Hyderabad
April 17, 2024 03: 44 AM
Slider మహబూబ్ నగర్

దేశ సమైక్యతకు పి.వి ఎనలేని కృషి

#P V Nagarkurnool

స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశ సమైక్యతకు సంక్షేమానికి ఎనలేని కృషి చేసి ప్రజల గుండెల్లో నిలిచారని కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్  మునిసిపల్ కౌన్సిలర్లు తీగల సునింద్ర, నిజామోద్దీన్ లు అన్నారు. ఆదివారం నాడు జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి స్వగృహం లో ఆయన జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అపర చాణక్యుడిగా బహుభాషా ప్రజ్ఞాశీలి గా పీవీ పేరు గడించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేసి పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చిన ఘనత ఆయనకు ఉందని అన్నారు . మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాల పాటు ఏకధాటిగా పాలించి సత్తా చాటుకున్నారని కొనియాడారు.

ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకోవచ్చు దేశ అభ్యున్నతికి దేశ రక్షణకు నిరంతరం పాటుపడ్డారని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డేవిడ్ రాజు కౌన్సిలర్లు జ్యోతి నాయకులు సలీం. అహ్మద్ పాషా, రవీందర్ గౌడ్, నూర్జన్, శ్రీనివాసరావు, మల్లయ్య, కొత్త గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ధ‌ర‌లు దిగిరావాలి…జ‌గ‌న్ దిగిపోవాలి…అంటూ టీడీపీ ధ‌ర్నా…!

Satyam NEWS

మృతుడి కుటుంబానికి అండగా నిలిచిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

Satyam NEWS

గన్నవరం విధ్వంసం పై ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

Satyam NEWS

Leave a Comment