పటాన్ చెరు లోని TRR మెడికల్ కళాశాలలో పంచాయతీ రాజ్ సంఘటన్ శిక్షణా శిబిరంలో బుధవారం TPCC ప్రెసిడెంట్, MP కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
ఎఐసిసి పంచాయతీ రాజ్ సంఘటన్ చైర్మన్, మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల కోసం గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థల కోసం అన్ని జిల్లాల్లో శిక్షణా శిబిరాలు నిర్వహించాలని పంచాయతీ రాజ్ సంఘటన్ కార్యక్రమంలో నిర్ణయించామన్నారు.
తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని కెప్టెన్ ఉత్తమ్ ఎన్నికైన స్థానిక సంస్థ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆయన అన్నారు.
స్థానిక ప్రజాప్రతినిధులైన సర్పంచ్, ఎంపిటిసి, ఎంపిపి, జెడ్పిటిసిలు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల విధులు, హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని అన్నారు.