28.7 C
Hyderabad
April 17, 2024 03: 57 AM
Slider ప్రత్యేకం

సోనియమ్మ రాజ్యం కోసం రాబోయే 18 నెలలు దీక్షగా పనిచేయాలి

#revanthreddy

శిక్షణ తరగతులలో దిశానిర్దేశం చేసిన  రేవంత్ రెడ్డి

తెలంగాణలో సోనియమ్మ రాజ్యం కోసం రాబోయే 18 నెలలు ప్రతి ఒక్కరూ దీక్షగా పని చేయాలని పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కొంపల్లిలో మంగళవారం ఏర్పాటుచేసిన కాంగ్రెస్‌ కార్యకర్తల శిక్షణా తరగతుల్లో భాగంగా  రేవంత్‌ రెడ్డి మల్కాజిగిరి పార్లమెంటు కాంగ్రెస్ నేతలతో ప్రత్యేకంగా మాట్లాడారు.

రాష్ట్రంలోని కార్యకర్తల మనోభావాలు తెలుసుకోవడానికే ఈ శిక్షణా తరగతులు ఏర్పాటు చేసినట్లుగా  చెప్పారు. కాంగ్రెస్‌లో క్రమశిక్షణ ముఖ్యం. మేం పదవులు అనుభవిస్తున్నామంటే దానికి కారణం కార్యకర్తలేనన్నారు. సోనియమ్మ రాజ్యం కోసం కష్టపడే వారికి పదవులు, టికెట్లు ఇచ్చే బాధ్యత నేనే తీసుకుంటానన్నారు.

కష్టపడే కార్యకర్తలను రాహుల్‌గాంధీతో సన్మానం చేయిస్తా. కష్టపడని వారిపై జనవరి 26 తర్వాత నేనే చర్యలు తీసుకోనున్నట్టుగా తెలిపారు. ఉప్పల్ నియోజకవర్గం ఏ బ్లాక్ అధ్యక్షుడు మందముళ్ళ పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బ్లాక్ పరిధిలోని వివిధ డివిజన్ల అధ్యక్షులు రఫీ, ప్రకాష్ రెడ్డి, కాలేరు నవీన్, కొంపల్లి బాలరాజ్ ముదిరాజ్ శిక్షణ తరగతులకు హాజరయ్యారు.

Related posts

కన్ఫర్మ్: అచ్చెన్నాయుడితో బాటు ఆరుగురి అరెస్టు

Satyam NEWS

నిన్నటి వరకు రెవిన్యూ.. ఇవాళ్టి నుంచీ పోలీసు శాఖ ఉరుకులు పరుగులు

Satyam NEWS

(Over The Counter) Is There Anywhere To Buy Hemp Cbd Flower In Pa Hemp Derived Cbd Laws California Medical Benefits Of Hemp Cbd Oil

Bhavani

Leave a Comment