కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజక వర్గ ఎల్లారెడ్డి జడ్పీటీసీ ఉషాగౌడ్ ఆదివారం కాంగ్రెస్ పార్టీ నుండి తెరాస పార్టీలోకి రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై, స్థానిక ఎమ్మెల్యే జాజల సురేందర్ నియోజక వర్గ అభివృద్ధికి చేస్తున్న కృషి , సంక్షేమ పథకాల అమలు చేస్తున్న పని తీరునచ్చి ఎమ్మెల్యే సురేందర్ నాయకత్వంలో తెరాస పార్టీలో చేరారన్నారు.
మంత్రి ఆయనకు తెరాస పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి నాయకులు సత్యం రావు , శ్రీనివాస్ నాయక్ , శ్రీనివాస్ గౌడ్, నాగం సాయిబాబా, నాగం గోపి, సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.