27.7 C
Hyderabad
April 24, 2024 09: 03 AM
Slider నిజామాబాద్

కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లో చేరిన ఎల్లారెడ్డి జడ్పీటీసీ

#MinisterPrashanthReddy

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజక వర్గ ఎల్లారెడ్డి జడ్పీటీసీ ఉషాగౌడ్ ఆదివారం కాంగ్రెస్ పార్టీ నుండి తెరాస పార్టీలోకి రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో చేరారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కెసిఆర్  చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై, స్థానిక ఎమ్మెల్యే జాజల సురేందర్ నియోజక వర్గ అభివృద్ధికి చేస్తున్న కృషి , సంక్షేమ పథకాల అమలు చేస్తున్న పని తీరునచ్చి ఎమ్మెల్యే సురేందర్ నాయకత్వంలో  తెరాస పార్టీలో చేరారన్నారు.

మంత్రి ఆయనకు తెరాస పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి నాయకులు సత్యం రావు , శ్రీనివాస్ నాయక్ , శ్రీనివాస్ గౌడ్, నాగం సాయిబాబా, నాగం గోపి, సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాజంపేట మునిసిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు…

Satyam NEWS

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ

Satyam NEWS

తుఫానుప‌ట్ల అప్ర‌మ‌త్తం. .23వ తేదీన అల్పపీడనం…

Satyam NEWS

Leave a Comment