హైదరాబాద్ లోని ఉప్పల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తన వంతు కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి అన్నారు. ఉప్పల్ డివిజన్లో నీ 45 .30 లక్షల వ్యయంతో సి సి రోడ్లు, డ్రైనేజీ పనుల కు బుధవారం ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పెండింగ్లో ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు . నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో పిర్జాధిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి టిఆర్ఎస్ సీనియర్ నాయకులు అరటికాయల భాస్కర్ ,మేకల హనుమంత్ రెడ్డి ,డివిజన్ తెరాస అధ్యక్షులు వేముల సంతోష్ రెడ్డి, మేకల మధుసూదన్ రెడ్డి , చింతల సింహ రెడ్డి, మైసయ్య, వెంకట్ ,ప్రవీణ్,అధికారులు ఈ ఈ నాగేందర్, ఏ ఈ వసంత తదితరులు పాల్గొన్నారు.