నిన్నరాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మిక సంఘాలు మంత్రుల ఇళ్ల వద్ద ధర్నాలు చేశాయి. ఈ సందర్భంగా సీపీఐ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి లేఖ రాశారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధులను తిరిగి జమ చేయాలి. రూ.450 కోట్లు భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధులు ఇతర రంగాలకు మళ్ళించారు. గత 18 నెలలుగా ఇసుక కొరత, కరోనాల వల్ల పనులు లేక కార్మికులు అవస్థలు పడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో కార్మికులు జేఏసీగా ఏర్పడి ఆందోళనకు సిద్ధమయ్యారు. సంక్షేమ బోర్డు నిధులను వినియోగించి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని రామకృష్ణ ఆ లేఖలో కోరారు.