మునిసిపల్ కార్పోరేషన్ పరిధిలోని అల్లిపురం, వైఎస్సార్ నగర్ లో నిర్మిస్తున్న డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పురోగతిని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పనులు త్వరగా పూర్తయితే బిల్లులు వెంటనే వస్తాయని తెలిపారు. వర్కర్లను పెంచాలని, అన్ని బ్లాకుల్లో పనులు చేపట్టాలన్నారు. పనుల్లో రోజువారి పురోగతి ఉండాలని, రోజూ పనులు జరిగేట్లు పర్యవేక్షణ చేయాలన్నారు. సమస్యలు ఉంటే దృష్టికి తేవాలని, ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం కావున అధికారులు వ్యక్తిగత శ్రద్ధ వహించాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, డిఆర్వో శిరీష, ఆర్ అండ్ బి ఇఇ శ్యామ్ ప్రసాద్, డబల్ బెడ్ రూమ్ డిఇ టి. కృష్ణారెడ్డి, అధికారులు తదితరులు ఉన్నారు.
previous post