మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఓ యువకుడు నిండు ప్రాణాలను పోగొట్టుకున్న సంఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని చిల్పూర్ మండలం లింగంపల్లి గ్రామ శివారు దేవోజీ తండాలో జరిగింది.
చిల్పూర్ ఎస్ఈ మహేందర్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం .. దేవోజీ తండాకు చెందిన అరకావత్ రమేష్ ( 23 ) ఆదివారం తండాలో హోలీ సంబరాల సందర్భంగా మద్యం తాగిన రమేష్ మద్యం మత్తులో పురుగుల మందును కూడా తాగాడు.
చికిత్స కోసం వెంటనే రమేష్ ను వరంగల్ ఎంజీఎం తరలించడం జరిగింది. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు తెలిపారు.
మృతుడి తండ్రి కేబాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఇ మహేందర్ తెలిపారు.