అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నం తరలించడంలో భాగంగా అక్కడ నిర్మిస్తున్న గెస్ట్ హౌస్ లను ప్రస్తావిస్తూ రాష్ట్ర హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైంది.
సిఆర్ డి ఏ రద్దు, అధికార వికేంద్రీకరణ చట్టాలపై రాష్ట్ర హైకోర్టు స్టేటస్ కో విధించినా కూడా విశాఖ పట్నంలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడాన్ని ఢిల్లీకి చెందిన ప్రముఖ న్యాయవాది సతీష్ గుప్తా ప్రశ్నిస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
రాష్ట్రపతి భవనం ఐదు ఎకరాల్లో ఉండగా కాపులుప్పాడులో 30 ఎకరాల్లో ప్రభుత్వ గెస్ట్ హౌస్ను ఎలా కడతారని న్యాయవాది నితీష్ గుప్తా తన పిటిషన్ లో ప్రశ్నించారు.
వాదనలు విన్న అనంతరం దీనిపై వచ్చేనెల 10లోపు కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఏపీ సీఎస్కు ఆదేశం ఇచ్చింది.