కోర్టు ఆదేశాలను ధిక్కించిన కేసులో నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలి ఫరుకి కి రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నిర్మల్ జిల్లా ముధోల్ మేజర్ గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధుల తొలగింపు విషయంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను జిల్లా కలెక్టర్ అమలు చేయలేదు.
ఆయనతో బాటు హైకోర్టు ఆదేశాలు అమలు చేయడం లో విఫలం అయినందుకు జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు కు కూడా కోర్టు ధిక్కరణ నోటీలు అందాయి. కలెక్టర్, DPO ఇద్దరు కూడా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు లో ఈ నెల 27న వ్యక్తిగతం గా హాజరుకావాల్సి ఉంటుంది.
కోర్టు ఆదేశాల్ని అమలు చేయుటలో విఫలం అయినందుకు గాను ఎందుకు శిక్షించబడకూడదనే కారణాన్ని కూడా వారు చూపించాల్సి ఉంటుంది.