39.2 C
Hyderabad
March 28, 2024 15: 01 PM
Slider హైదరాబాద్

జగన్ గురూజీ ఆధ్వర్యంలో నిర్విరామంగా అన్నదానం

jagan gurujee

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించడానికి కోసం ఏర్పాటు చేసిన లాక్ డౌన్ కారణంగా ప్రజాజీవితం స్తంభించింది. దీంతో   ఏ ఆధారం లేని అనేక మందికి ఆహార కొరత ఏర్పడి పస్తులు ఉంటున్నారు.

ఈ సందర్భంగా శ్రీ మాతా యోగ  అన్నపూర్ణేశ్వరి చరిటేబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టారు. దీనిలో భాగంగా బుధవారం కూకట్ పల్లి, హైదర్ నగర్ లో పారిశుధ్య కార్మికులకు భోజనాలను ఏర్పాటు చేశారు.

కరోనా వైరస్ పట్ల వారికి  అవగాహన కల్పించి దాని బారినుండి ఎలా రక్షించుకోవాలో జాగ్రత్తలు చెప్పారు. ఈ కార్యక్రమంలో  వేణుగోపాల్ రెడ్డి, జర్నలిస్ట్ లక్ష్మణ్ ప్రసాద్,తదితరులు  పాల్గొన్నారు. శ్రీ మాత యోగ అన్నపూర్ణేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ శ్రీ జగన్ గురూజీ ఆధ్వర్యంలో అనేక ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న ఆహారం అందని అభాగ్యులతో పాటు, పేద ప్రజల కోసం చేపడుతున్న అన్నదాన కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది.

దీంతో పలు ప్రాంతాల్లోని అనేకమంది దాతలు తమ వంతు  సహాయం  చేయడానికి కోసం ముందుకు వస్తున్నారు. ట్రస్ట్ సభ్యులను  ఆహార పదార్థాలను ట్రస్ట్ కు  ఎలా అందజేయాలి అంటూ వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. సహాయం అందజేసే వారు ముందుకు రావచ్చని ట్రస్ట్ సభ్యులు తెలిపారు.

Related posts

ఘనంగా బిజెపి పార్టీ 43 వ ఆవిర్భావ దినోత్సవాలు

Satyam NEWS

తిరుపతిలో మద్యం దుకాణాలు మూసివేయాలి

Satyam NEWS

సొనాలికా ఆగ్రో సొల్యూషన్స్‌ ట్రాక్టర్‌, ఇంప్లిమెంట్స్‌ రెంటల్‌ యాప్‌ విడుదల

Satyam NEWS

Leave a Comment