తమను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆషా డే కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యుగులు నిరసన కార్యక్రమం నిర్వహించిన అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆవరణలో మానవహారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు నిరసన తెలియజేసి మానవహారం నిర్వహించామని అన్నారు.
తమ నిరసన కార్యక్రమం 65 వ రోజుకు చేరుకుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 27ను సవరించి ఆర్థిక భృతి కల్పించాలని అన్నారు.
తమను రెగ్యులర్ చేసి తమ చిరకాల వాంఛను నెరవేర్చాలని కోరారు. వీరి నిరసన కార్యక్రమానికి సిహెచ్ ఓ చంద్రశేఖర్ హెచ్ వి కోటేశ్వరమ్మ మద్దతు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు రాము కిరణ్ కుమార్ సురేష్ ఎఎన్ఎంలు ఆశాకార్యకర్తలు వైద్య కాంట్రాక్టు పారా మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.