39.2 C
Hyderabad
April 25, 2024 15: 39 PM
Slider విశాఖపట్నం

సింహాచలం భూములు కాజేసేందుకు చైర్మన్ మార్పు

bjp vizag

సింహాచలం భూములు కాజేసేందుకు సింహచలం దేవస్థానం చైర్మన్ ను మారుస్తూ రాత్రికి రాత్రి ప్రభుత్వం జీవోలు విడుదల చేసిందని బి జె పి ఎమ్మెల్సీ పి వి ఎన్ మాధవ్ అన్నారు. చైర్మన్ గా ఉన్న పూసపాటి అశోక్ గజపతి రాజు కు సమాచారం ఇవ్వకుండా సంచయిత రాజు ను చైర్మన్ నియమించాడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు.

 ఆమె బిజెపి ప్రతినిధి గా ఉన్నారని, ఆ పదవి నుంచి తొలగించాలని కేంద్ర పార్టీకి లేఖ రాస్తున్నామని ఆయన తెలిపారు. నిన్న జరిగిన ప్రమాణ స్వీకార వేడుకలో  వైసీపీ నేతలకు, సీఎం, విజయసాయి రెడ్డిలకు ఆమె కృతజ్ఞతలు చెప్పడం అందరు గమనించారు.

బిజెపి అధిష్టానంతో చెప్పకుండా సంచయిత ఈ నిర్ణయం తీసుకుని చైర్మన్ గా పదవి పొందడాన్ని ఖండిస్తున్నామని ఆయన అన్నారు. విశాఖను రాజధాని గా చేస్తున్న సమయంలో దేవాలయ భూములు పై అధికార పార్టీ  కన్ను వేసిందని, దేవాలయ భూములను స్వ ప్రయోజనాలకు వినియోగించుకోవాలనే ఆలోచన చేస్తున్నారని ఆయన అన్నారు.

Related posts

ఏపి రైతు సాధికార దోపిడి సంస్థ

Satyam NEWS

ప్రతి ఒక్కరూ ఓటర్ గా పేరు నమోదు చేసుకోవాలి

Satyam NEWS

సి‌పి‌ఐ జాతీయ సమితి సభ్యునిగా బాగం

Murali Krishna

Leave a Comment