సింహాచలం భూములు కాజేసేందుకు సింహచలం దేవస్థానం చైర్మన్ ను మారుస్తూ రాత్రికి రాత్రి ప్రభుత్వం జీవోలు విడుదల చేసిందని బి జె పి ఎమ్మెల్సీ పి వి ఎన్ మాధవ్ అన్నారు. చైర్మన్ గా ఉన్న పూసపాటి అశోక్ గజపతి రాజు కు సమాచారం ఇవ్వకుండా సంచయిత రాజు ను చైర్మన్ నియమించాడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు.
ఆమె బిజెపి ప్రతినిధి గా ఉన్నారని, ఆ పదవి నుంచి తొలగించాలని కేంద్ర పార్టీకి లేఖ రాస్తున్నామని ఆయన తెలిపారు. నిన్న జరిగిన ప్రమాణ స్వీకార వేడుకలో వైసీపీ నేతలకు, సీఎం, విజయసాయి రెడ్డిలకు ఆమె కృతజ్ఞతలు చెప్పడం అందరు గమనించారు.
బిజెపి అధిష్టానంతో చెప్పకుండా సంచయిత ఈ నిర్ణయం తీసుకుని చైర్మన్ గా పదవి పొందడాన్ని ఖండిస్తున్నామని ఆయన అన్నారు. విశాఖను రాజధాని గా చేస్తున్న సమయంలో దేవాలయ భూములు పై అధికార పార్టీ కన్ను వేసిందని, దేవాలయ భూములను స్వ ప్రయోజనాలకు వినియోగించుకోవాలనే ఆలోచన చేస్తున్నారని ఆయన అన్నారు.