ఢిల్లీ ఎయిమ్స్లో చేరి చికిత్స పొందుతున్న ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ మన: శాంతి కోసం భగవద్గీత చదువుకుంటుంటే ఆసుపత్రి సిబ్బంది అడ్డుకున్నారు. పాట్నాలోని మాజీ ముఖ్యమంత్రి మరియు భార్య రబ్రీ దేవి అధికారిక నివాసంలో జూలై 3న లాలూ యాదవ్ మెట్లపై నుండి పడిపోయారు. అక్కడ ఆయన కుడి భుజం ఫ్రాక్చర్ అయింది వెన్నుపూసకు గాయం ఏర్పడింది.
దాంతో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరారు. ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన బీహార్ మాజీ సీఎం లాలూ యాదవ్ ఆరోగ్యం వేగంగా మెరుగుపడుతోంది. తన తండ్రి ఆరోగ్యం ఇప్పటికే చాలా మెరుగుపడిందని అతని పెద్ద కుమార్తె మిసా భారతి సోమవారం చెప్పారు.
అయినప్పటికీ, మూత్రపిండాల సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఆయనకు క్రియాటినిన్ పెరిగింది. అయితే గతంలో కంటే ఇప్పుడు పరిస్థితి నిలకడగా ఉంది. వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఆమె చెప్పారు. లాలూ యాదవ్ను ఇప్పుడు ఐసీయూ నుంచి ప్రైవేట్ వార్డుకు తరలించారు. అక్కడ ఆయన భగవద్గీత చదువుకుంటుంటే సిబ్బంది అడ్డుకోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
హాస్పిటల్లో తన తండ్రి శ్రీమద్ భగవత్ గీత చదవకుండా, వినకుండా ఆపారని, తండ్రికి గీత చదవడం, వినడం అంటే చాలా ఇష్టం అని తేజ్ప్రతాప్ యాదవ్ ఆరోపించారు. గీత చదవకుండా ఆపే హక్కు ఎవరికి లేదని ఆయన అన్నారు.