28.7 C
Hyderabad
April 20, 2024 03: 58 AM
Slider హైదరాబాద్

కరోనా కష్ట కాలంలో సేవ చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞత

#BJPAmberpet

కరోనా కష్ట కాలం లో పారిశుద్ధ్య  సమస్యల పరిష్కారానికి జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు ముందు ఉండి పని చేస్తున్నారని హైదరాబాద్ లోని బాగ్ అంబర్ పేట్ డివిజన్ కార్పొరేటర్ పద్మా వెంకట్ రెడ్డి అన్నారు.

పారిశుద్ధ్య కార్మికుల సేవలకు ధన్యవాదాలు తెలుపుతూ నేడు ఆమె ఆంధ్ర బ్యాంకు చౌరస్తా లో పారిశుధ్య కార్మికులకు జ్యూస్ పంపిణి చేశారు.

ఈ సందర్బంగా కార్పొరేటర్ పద్మా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తించి  వారిని అభినందించాల్సిన అవసరం ఉందని అన్నారు.

పారిశుధ్య కార్మికులు కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ పనిచేయవలసిందిగా వారికి విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమం లో గ్రేటర్ హైదరాబాద్ మాజీ అధ్యక్షులు బి.వెంకట్ రెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ గౌడ్, బాగ్ అంబర్ పేట్ డివిజన్ ప్రధాన కార్యదర్శులు జేమ్మిచిట్టి బాలరాజు, కోడూరి సురేష్ డివిజన్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Related posts

రైతులను ఇబ్బంది పెడుతున్న కేంద్రo

Murali Krishna

ఏలూరులో సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా మేడే

Satyam NEWS

ప్రతి చట్టం పై పిల్లలకు అవగాహన అవసరం

Satyam NEWS

Leave a Comment