కడప జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు మంగళవారం ముద్దనూరు పరిధిలోని పోలీసులు చింతకుంట గ్రామం లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
గ్రామంలో ఆణువణువూ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.
ముద్దనూరు సి.ఐ గోపినాథ్, కొండాపురం ఎస్.ఐ మంజునాథ్, పి.ఎస్.ఐ షరీఫ్, ముద్దనూరు ఎస్.ఐ శంకర్ రావు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.