కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి కోరారు.
కరోనాపై పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీ చేపట్టిన జిల్లా ఎస్పీ కోడుమూరు పట్టణంలో విద్యార్దులతో కలిసి మాస్కుల గురించి వివరించారు.
ప్రజలు బయటికి వస్తే మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ప్రజలకు జిల్లా ఎస్పీ మాస్కులు అందచేశారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాలు, ప్రయాణాల్లో ప్రజలు మాస్కులను తప్పనిసరిగా ధరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో కోడుమూరు సీఐ శ్రీధర్, ఎస్సైలు మల్లి కార్జున, శివాంజల్ , శరత్ కుమార్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.