విద్యలనగరమైన విజయనగరంలో అన్ని సంస్థలు సంయుక్తంగా ఫోరం ఫర్ బెటర్ విజయనగరం గా ఆవిర్భవించాయి. ఈ నేపథ్యంలో అన్ని సంస్థలు కలిసి…నగరంలో కరోనా నివారణ… మాస్క్ అవసరం అన్న దానిపై ర్యాలీ నిర్వహించారు.
నగరంలో ని పైడితల్లి అమ్మవారి టెంపుల్ వద్ద ఈ ర్యాలీని స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి జెండా ఊపి ప్రారంభించారు. అలాగే మేయర్ వీ.విజయలక్ష్మి.. డిప్యూటీ మేయర్ ,స్టాండింగ్ కమిటీ చైర్మన్ రాజేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామి మాట్లాడుతూ.. కరోనా సెకండ్ వేవ్ పట్ల ప్రతీ ఒక్కరూ జాగరూకతతో ఉండాలని 45 ఏళ్ల పైబడిన ప్రతీ ఒక్కరూ వాక్సినేషన్ వేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్పోరేషన్ కమీషనర్ వర్మ మాట్లాడుతూ.. ఈ సెకండ్ వేవ్ లో అందుబాటులో వచ్చిన వాక్సినేషన్ నూ ప్రతీ ఒక్కరూ వేసుకోవాలన్నారు.
ఈ పరిస్థితులలో స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందించదగ్గ అంశమన్నారు. అనంతరం అమ్మవారి కోవెల నుంచీ ప్రారంభమైన ర్యాలీ కన్యకాపరమేశ్వరి టెంపుల్ వరకూ కొనసాగింది.