ఏపి సచివాలయంలో మరో 10మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. గత కొద్ది రోజులుగా సచివాలయంలో కరోనా కలకలం రేగుతూనే ఉంది. సచివాలయంలో తాజాగా మరో పది మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఉద్యోగులు భయాందోళనలకు గురి అవుతున్నారు.
సచివాలయం, అసెంబ్లీలో కలిపి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 28కి చేరింది. ఇరిగేషన్ శాఖలో తాజాగా మూడు పాజిటివ్ కేసులు నమోదు అవడంతో ఆ శాఖలో ఉద్యోగులకు ఈనెల 14 వరకు వర్క్ ఫ్రమ్ హోంకు మౌళిక ఆదేశాలు జారీ చేశారు.