నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం లోని చింతపల్లి మండలంలో రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తుందని మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని, పాజిటివ్ వచ్చినవారు డాక్టర్ల సూచన మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మాల్ వైద్యాధికారి డాక్టర్ శ్రీదేవి తెలియజేశారు.
మాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో కరోనా టెస్టులు ప్రతిరోజు జరుగుతున్నాయని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రతి ఒక్కరూ వచ్చి టెస్టులు చేయించుకోవాలన్నారు. సోమవారం నిర్వహించిన పరీక్షల్లో చింతపల్లి మండలం మాల్ పి హెచ్ సి లో 48 మందికి టెస్టులు నిర్వహించగా 14 కేసులు నమోదైనట్లు తెలిపారు.
అందులో పోలేపల్లి రాంనాగర్ 5, వీటి నగర్ 4, కుర్మెడు 5 పాజిటివ్ వచ్చాయని, చింతపల్లి మండల కేంద్రంలో 103 మందికి టెస్టులు చేయగా 10 నిర్ధారణ అయిందన్నారు. పాజిటివ్ వచ్చినవారికి మెడికల్ కిట్లు మరియు మందులు పంపిణీ చేస్తున్నామన్నారు.
మండలం లోని ప్రజలందరూ కరోనా మహమ్మారి బారినపడకుండా స్వీయ నియంత్రణ పాటించి,తగు జాగ్రత్తలు తీసికొని మంచి పౌష్టికాహారం తీసుకుంటూ ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలని సూచించారు. మెడికల్ టెస్టులు నిర్వహిస్తున్న వారు వెంకన్న, సూపర్వైజర్ అమృత తదితర మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.