కాళింది మడుగులో దిగి మహాసర్పాన్ని తుదముట్టించిన శ్రీకృష్ణుడిలా ఈ పసివాడు కరోనాను తుదముట్టించి విజేతగా నిలిచాడు. తూర్పు గోదావరి జిల్లా గిరిజన ప్రాంతానికి చెందిన టి.లక్ష్మికి ఆమె కుమారుడు నాలుగు నెలల బాలుడికి కరోనా సోకింది.
ప్రాధమిక వైద్యం అందించే సమయంలో ఈ కరోనా విషయం నిర్ధారణ కావడంతో వారిని విశాఖపట్నంలోని విమ్స్ ఆసుపత్రికి తరలించారు. మే 25న తల్లీకొడుకులు ఆసుపత్రిలో చేరారు. వారిద్దరి పరిస్థితి క్షీణించడంతో వారికి తదుపరి చికిత్స కోసం వెంటిలేటర్ ఉంచారు.
18 రోజుల పాటు చికిత్స చేసిన తర్వాత తల్లీ కొడుకులు ఇద్దరికి కరోనా నెగెటీవ్ వచ్చింది. పిల్లవాడికి పూర్తి స్వస్థత చేకూరడంతో నేడు విమ్స్ డాక్టర్లు డిశ్చార్జి చేశారని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలిపారు. అంత చిన్న వయసు బాలుని కి మంచి వైద్యం అందించి కోవిడ్ – 19 నుండి కోలుకు నేలా కృషి చేసిన వైద్యుల ను జిల్లా కలక్టరు అభినందించారు.