చైనాలో మరోసారి కరోనా కేసులు భారీగా పెరిగాయి. బుధవారం నాటికి రోజువారీ కోవిడ్ కేసులు అత్యధికంగా 31,454కి చేరుకున్నాయి. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఇది అత్యధిక స్థాయి. చైనా నేషనల్ హెల్త్ బ్యూరో అందించిన ఈగణాంకాలు విస్తుపోయేలా చేస్తున్నాయి. ఒకే రోజులో చాలా కేసులు నమోదవడంతో, చైనా ప్రభుత్వం, లాక్డౌన్, ప్రయాణ ఆంక్షలు విధించడమే కాకుండా, కరోనా మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి పరీక్షలు మరియు టీకాలను కూడా తీవ్రతరం చేస్తోంది. కరోనా లాక్డౌన్తో రాజధాని బీజింగ్లో కఠిన ఆంక్షలు విధించారు. పార్కులు, కార్యాలయ భవనాలు, షాపింగ్ మాల్స్ మూతపడ్డాయి. బీజింగ్లో అత్యధిక జనాభా కలిగిన చాయోయాంగ్ జిల్లా దాదాపు పూర్తి లాక్డౌన్లో ఉంచారు. రాజధాని బీజింగ్లో అత్యంత ప్రభావిత ప్రాంతంగా మారిన చాయాంగ్ జిల్లాలోని 3.5 మిలియన్ల మంది నివాసితులు వైరస్ నుండి దూరంగా ఉండాలని ఆరోగ్య అధికారులు కోరారు.
కాబట్టి ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండాలని కోరారు. చైనాలోని కొన్ని ప్రాంతాలలో ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. కొన్ని ప్రావిన్సులు మూడేళ్లలో అత్యంత తీవ్రమైన, సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. చైనా అంతటా కొత్త గా కరోనా సోకిన వారి సంఖ్య నిరంతరం పెరుగుతోంది. నవంబర్ 1 నుండి, దేశవ్యాప్తంగా మొత్తం 2,80,000 మందికి కరోనా సోకినట్లు ఒక అంచనా. గత వారం సగటున రోజుకు 22,200 కేసులు నమోదయ్యాయి. చైనా బ్రోకరేజ్ సంస్థ నోమురా అంచనా ప్రకారం కోవిడ్ కేసుల సంఖ్య పెరగడంతో, గత వారంలో స్టాక్ మార్కెట్ కూడా ప్రభావితమౌతున్నది. నవంబర్ 21 నాటికి, ప్రభుత్వ డేటా ప్రకారం, 49 నగరాలు ప్రస్తుతం పాక్షిక లాక్డౌన్ లేదా నియంత్రణ చర్యల పరిధిలోకి వచ్చి ఉన్నాయి. ఈ లాక్డౌన్ చర్యల వల్ల ప్రస్తుతం 412 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. దేశంలో యాంటీ-కరోనా వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) చైనాకు సూచించింది.