గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కరోనా కలకలం రేగింది.
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని అయిదో అంతస్తులో ఉన్న చీఫ్ ఇంజినీర్ విభాగంలో ఇద్దరికి కరోనా సోకింది.
అప్రమత్తమైన బల్దియా ఆ అంతస్తులోని ఉద్యోగులందరికీ సెలవు ప్రకటించింది. కరోనా కేసులు వచ్చిన ఫ్లోర్ను శానిటైజ్ చేయించింది.