నాగర్ కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడ గ్రామం లోని మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాలలో శుక్రవారం నలుగురు విద్యార్ధినిలకు కరోన పాజిటివ్ వచ్చింది.
అదేవిధంగా 53 మంది విద్యార్థులకు, 30మంది టీచింగ్, నాన్-టీచింగ్, సిబ్బందికి కరోనా టెస్టులు చేయనున్నారు. 83 మంది ని ఐసోలేషన్ కు తరలించారు.
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ సదరు పాఠశాలను సందర్శించి నివారణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండే విధంగా నివారణ చర్యలు తీసుకునే విధంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ శర్మన్ ఆదేశించారు.