స్కూలు పిల్లలను కరోనా వదలడం లేదు.
శంషాబాద్ మండలం చిన్నగోల్కొండ ప్రభుత్వ పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్దులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
ఇప్పటికే పలు స్కూళ్లలోనూ, గురుకుల విద్యాలయాలలో పలువురు విద్యార్ధులకు కరోనా సోకుతున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు తాజాగా శంషాబాద్ లో మరోమారు కరోనా కలకలం రేగింది.