తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం తాటిపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరోనా కల్లోలం చెలరేగింది. పాఠశాలలో ఏడుగురు ఉపాధ్యాయులకు కోవిడ్ పాజిటివ్ రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. దాంతో అధికారులు పాఠశాల ఆవరణలో, తరగతి గదులు, బెంచీలు పూర్తిగా శానిటైజ్ చేయించారు. ఉపాధ్యాయులు కరోనా బారినపడిన విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లడంతో రెండు రోజుల పాటు స్కూలుకి సెలవులు ప్రకటించారు.
previous post