ప్రతి నిత్యం పలు రకాల వ్యాపారాలతో ప్రజలతో ఉండే ఆర్య వైశ్యులు కరోనా బారిన పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నెల్లూరు వారి ఆయుర్వేద మందును ఉచితంగా పంపిణి చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ నాయకులు కోనా శ్రీనివాసరావు, నుదురుమాటి శ్రీనివాస్, నారాయణ, విశ్వేశ్వరరావు, రాష్ట్ర నాయకులు చిన్ని రామ సత్యనారాయణ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
కరోనా రాకుండా నెల్లూరు వారి ఆయుర్వేద మందును పాలకొల్లు శ్రీ వాసవీ ఆర్య వైశ్య సంఘం సుమారు 600 మంది ఆర్య వైశ్యులకు ఉచితంగా పంపిణీ చేసింది.