తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కరోనా వైరస్ తీవ్ర అడ్డంకిగా నిలిచే ప్రమాదం కనిపిస్తున్నది. రోజు రోజుకు తమిళనాడులో కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే.
ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్న నలుగురు ఎమ్మెల్యే అభ్యర్థులు, ముఖ్యనేతలకు కరోనా సోకింది. ఎంఎన్ఎం లో ఇద్దరు, డీఎంకేలో ఇద్దరు అభ్యర్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది.
దాంతో వారు ఐసోలేషన్ లోకి వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది. ఈ కారణంతో ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులు వెనకడుగు వేస్తున్నారు.
తమిళనాడులో ఇప్పటికే కరోనా కారణంగా విద్యాసంస్థలు మూసివేసిన విషయం తెలిసిందే.