ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. మరియమ్మ (65) అనే మహిళ కు గత రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు పొందుతుంది.
తనకు కరోనా వచ్చిన విషయం తమ గ్రామస్తులకు తెలిస్తే అవమానిస్తారని భావించింది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని, వైద్యులు చేసే చికిత్స వల్ల రోగం నయం అవుతుందో లేదో అని తీవ్ర ఆందోళన చెంది చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది.
గార్ల మండలం బుద్ధారం కు చెందిన బాధితురాలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఆత్మహత్య చేసుకోవటం తీవ్ర కలకలం రేపుతుంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.